జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టనున్న మూడో విడత వారాహి యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది.ఈ మేరకు పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశారని తెలుస్తోంది.
విశాఖపట్నం నుంచి రేపు ప్రారంభం కానున్న వారాహి విజయయాత్ర ఈనెల 19వ తేదీ వరకు కొనసాగనుంది.వారాహి యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు జనసేన ప్రకటించింది.
ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ ఇవాళ సాయంత్రం విశాఖకు వెళ్లనున్నారు.అయితే మెగాస్టార్ చిరంజీవిపై విమర్శల నేపథ్యంలో పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
వారాహి యాత్ర నేపథ్యంలో ఇప్పటికే పార్టీ నేతలకు, కార్యకర్తలకు నాదెండ్ల మనోహార్ దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.