తెలంగాణలో రామరాజ్యం ఏర్పాటుకు కృషి..: బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఏ పని అప్పగించినా బాధ్యతగా పని చేస్తానని చెప్పారు.

 Efforts To Establish Ramrajyam In Telangana..: Bandi Sanjay-TeluguStop.com

ఈ క్రమంలోనే తనపై నమ్మకం ఉంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణలో రామరాజ్యం ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

మరోవైపు ఇవాళ ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్ కు తిరుగు పయనం కానున్నారు.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి బండి సంజయ్ రాష్ట్రానికి వస్తున్నారు.

దీంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ఎయిర్ పోర్టు నుంచి ఎస్ఆర్ క్లాసిక్ గార్డెన్స్ కు ర్యాలీగా వెళ్లనున్నారు.

సాయంత్రం శంషాబాద్ ఎస్ఆర్ క్లాసిక్ గార్డెన్స్ లో నిర్వహించనున్న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube