కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును లోక్సభ ముందుకు తీసుకువచ్చింది.ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి లోక్ సభలో ప్రవేశపెట్టారని తెలుస్తోంది.
అయితే ఈ బిల్లును మొదటి నుంచి విపక్ష పార్టీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమంటూ విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లు సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.







