గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan ) హీరోగా కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘‘గేమ్ ఛేంజర్” ( Game Changer ) ఒకటి.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ మూవీపై భారీ అంచనాలే పెరిగాయి.
ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా చాలా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమా మాత్రం ఆలస్యం అవుతూనే ఉంది.

ప్రకటించినప్పటి నుండి ఏదో ఒక కారణంగా షూట్ ఆగిపోయింది.అయినా అన్ని అడ్డంకులను దాటుకుని దాదాపు లాస్ట్ స్టేజ్ కు తీసుకు వచ్చారు.ఇదిలా ఉండగా ప్రజెంట్ ఈ కాంబోపై ఇంట్రెస్టింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే వీరి కాంబోలో గేమ్ ఛేంజర్ తెరకెక్కుతుండగా మరో సినిమా కూడా ఈ కాంబోలో ఉంది అనే రూమర్స్ ఈ మధ్య వైరల్ అయ్యాయి.
ఇక దీనిపై క్లారిటీ తెలుస్తుంది.చరణ్ – శంకర్ ( Director Shankar ) కాంబోలో మరో సినిమా తెరకెక్కుతుంది అనే రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది.
ఇక ఇప్పుడు చేస్తున్న గేమ్ ఛేంజర్ ఈ నెలలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తుండగా ఇది కొత్త అనౌన్స్ మెంట్ అంటూ ప్రచారం చేస్తున్నారు.అంతేకాదు వీరి కాంబోలో రెండవ సినిమా అయితే ఇప్పటికి లాక్ అవ్వలేదు.

కాగా తమన్ సంగీతం( Thaman ) అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు.వచ్చే ఏడాది సమ్మర్ లో కానీ రిలీజ్ అయ్యేందుకు శంకర్ ప్లాన్ చేస్తున్నాడట.దీంతో చరణ్ ఫ్యాన్స్ కూడా వర్రీ అవుతున్నారు.ఇక చరణ్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ తన ప్రాజెక్ట్ ను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో ప్రకటించాడు.ఇది అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది అని టాక్.







