తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు.ఇందులో భాగంగా సుమారు 2900 మందిని పునరావస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు.
మోరంచపల్లి వరదలో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేస్తున్నామని తెలిపారు.ఈ క్రమంలో ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు.
హైదరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో పరిస్థితి అదుపులో ఉందని వెల్లడించారు.