గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఓ యువకుడు వినూత్న నిరసనకు దిగారు.పాముతో జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చిన యువకుడు దాన్ని వార్డు ఆఫీస్ లో టేబుల్ పై ఉంచి ఆందోళన చేపట్టాడు.
అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించాడు.గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అల్వాల్ ప్రాంతంలో ఇళ్లల్లోకి మురుగునీరుతో పాటు పాములు వస్తున్నాయని యువకుడు తెలిపాడు.
ఈ విషయమై ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడుతూ పాముతో నిరసనకు దిగారని సమాచారం.