ఉత్తరప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి.భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాగులు, వంకలతోపాటు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఓ బస్సు నదీ వరద నీటిలో చిక్కుకుని పోయింది.వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ బృందం క్రేన్ సాయంతో బస్సులోని 25 మంది ప్రయాణికులను కాపాడారు.
ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.