తెలంగాణలోని బీసీ కులాలన్నింటినీ ఏకం చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.బీఆర్ఎస్ బీసీ నేతలతో సమావేశం అయిన ఆయన మాట్లాడుతూ బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.
బీసీ నేతలపై కాంగ్రెస్ వ్యక్తిగత దూషణలకు దిగుతోందని మండిపడ్డారు.ఈ క్రమంలోనే తమ నాయకులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు.
ఇకపై బీసీ నేతలు, కార్యకర్తలపై దూషణలకు పాల్పడితే సహించేది లేదని తెలిపారు.తాము దేనికీ వెనకగుడు వేయమన్న మంత్రి తలసాని నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని వెల్లడించారు.







