ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి.ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది.
ఎన్జీటీ తీర్పుపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది.మార్చి 23న ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో నిషేధం తొలగించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఎన్జీటీ తీర్పును యధావిధిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.







