ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఏపీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు.
తమ విద్యార్థులు క్రియేటర్లుగా ఉండాలన్న జగన్ ఫాలోవర్లుగా కాదని చెప్పారు.అంతర్జాతీయ స్థాయిలో విద్యాసంస్థలతో ఎంవోయూలు పెంచుకోవాలని సూచించారు.
విద్యారంగంలో టెక్నాలజీని విరివిగా వినియోగించుకోవాలన్నారు.లోయర్, హయ్యర్ ఎడ్యుకేషన్ లో టెక్నాలజీ వినియోగించి మార్పులు తేవాలని తెలిపారు.
విద్యార్థులకు కావాల్సిన కోర్సులు, లెర్నింగ్ ఆప్షన్లపై చర్చించాలన్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్డిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అవసరమని పేర్కొన్నారు.
వైద్య విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని తెలిపారు.రానున్న రోజుల్లో సిలబస్, పరీక్షా విధానం సమూలంగా మార్చే అవకాశం ఉంది.
గ్లోబల్ ఎడ్యుకేషన్ మ్యాప్ లో ఏపీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.