ఈనెల 20వ తేదీన జరిగే కొల్లాపూర్ సభకు పేరు ఖరారు అయింది.ఈ మేరకు సభకు పాలమూరు ప్రజాభేరీ అనే పేరును కాంగ్రెస్ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నేత మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని పదహారు మందితో కమిటీ ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా నియోజకవర్గాల వారీగా బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది.
కాగా పాలమూరు ప్రజాభేరి సభకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.అదే రోజు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకోనున్నారని సమాచారం.
ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సభకు ధీటుగా పాలమూరు ప్రజాభేరీకి కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.