జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి ధర్మాన ప్రసాదరావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు.ఓ పెద్ద మనిషి వాలంటీర్లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు.
నాలుగు గోడల మధ్య సినిమాలు చేసే వాళ్లు గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారని విమర్శించారు.యాక్షన్లు చేయడం గొప్ప కాదన్న ఆయన నిజ జీవితం గొప్పని తెలిపారు.
రాత్రి, పగలు వాలంటీర్లు కష్టపడి పని చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో పనికి మాలిన వాళ్ల మాటలు వాలంటీర్లు పట్టించుకోవద్దని సూచించారు.