దేశ రాజధాని ఢిల్లీలో వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది.యమునా నదీ ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది.
ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ముంపు ప్రాంత బాధితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఈ నేపథ్యంలో వర్షాలపై ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఇందులో భాగంగానే మధ్యాహ్నం సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.







