ప్రకాశం జిల్లాలో దారుణం.. ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్య..!

భర్త చనిపోయిన మహిళకు ఓ వ్యక్తి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.భర్త లేని ఆ మహిళకు తానే జీవితాంతం తోడుగా ఉంటానని మాట ఇచ్చాడు.

 Man Murders His Girl Friend In Prakasam District,prakasam District,racherla Mand-TeluguStop.com

కొంత కాలం ఈ సహజీవనం ఎంతో సాఫీగా సాగింది.కానీ మోజు తీరాక ఆ ప్రియుడు ఆమెను వదిలించుకోవాలి అనుకున్నాడు.

కానీ ఆ మహిళ తమ బంధం తెంచుకునేందుకు ఇష్టపడలేదు.దీంతో ఆ ప్రియుడు ఆమెను శాశ్వతంగా వదిలించుకునేందుకు దారుణంగా హత్య చేశాడు.

ఈ ఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం( Prakasam District Racherla Mandal ) సంగపేటలో చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో పూర్తిగా చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.సంగం పేట గ్రామంలో ఓ మహిళా మృత దేహం ఊరి బయట ఉన్న రైల్వే ట్రాక్ పక్కన పడి ఉంది.ఆ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు గుర్తించారు.

సంగపేట కు చెందిన పిక్కిలి రంగస్వామి అదే గ్రామంలో సువర్ణ అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.సువర్ణకు గతంలో ఆకువీడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం( Marriage ) అయింది.భర్త చనిపోవడంతో గత పది సంవత్సరాలుగా సువర్ణ పుట్టింటి వద్దే ఉంటుంది.

రంగస్వామితో పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.అయితే ఐదు సంవత్సరాల పాటు సాగిన వీరి వివాహేతర సంబంధానికి తెరవేద్దామని రంగస్వామి, సువర్ణకు చెప్పాడు.

కానీ సువర్ణ అందుకు అంగీకరించలేదు.దీంతో శనివారం సువర్ణ గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన శవమై తేలింది.

పోలీసులు తమదైన శైలిలో రంగస్వామిని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube