మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది.కాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భోళా శంకర్ మూవీ( Bhola Shankar )లో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీకి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
![Telugu Bhola Shankar, Chiranjeevi, Ismart Shankar, Puri Jagannadh, Ram Pothineni Telugu Bhola Shankar, Chiranjeevi, Ismart Shankar, Puri Jagannadh, Ram Pothineni](https://telugustop.com/wp-content/uploads/2023/07/chiranjeevi-puri-jagannadh-tollywood-iSmart-Shankar-Bhola-Shankar.jpg)
నెక్స్ట్ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో చిరంజీవి సినిమాను చేయనున్నారు.ఈ సినిమా భోళా శంకర్ రిలీజ్ తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది.ఇది ఇలా ఉంటే చిరంజీవి పూరి జగన్నాథ్ తో వెబ్ వీడియో చాటింగ్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంచి స్టొరీ సిద్ధం చేయమని పూరి జగన్నాథ్ కి చిరు ఆఫర్ ఇచ్చారు.ఇప్పటికే లైగర్ డిజాస్టర్ తో సతమతమవుతున్నారు పూరి జగన్నాథ్.లైగర్ ఫ్లాప్ కారణంగా హీరోలు అందరూ కూడా పూరి నుంచి దూరంగా ఉన్నారు.అలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఆఫర్ ఇచ్చారు.
ఇక పూరి జగన్నాథ్ కూడా మంచి కథ సిద్ధం చేసుకొని మెగాస్టార్ ని మెప్పించారంట.
![Telugu Bhola Shankar, Chiranjeevi, Ismart Shankar, Puri Jagannadh, Ram Pothineni Telugu Bhola Shankar, Chiranjeevi, Ismart Shankar, Puri Jagannadh, Ram Pothineni](https://telugustop.com/wp-content/uploads/2023/07/chiranjeevi-puri-jagannadh-tollywood-iSmart-Shankar-Bhola-Shankar-Ram-Pothineni-.jpg)
అయితే అప్పటికే రామ్ పోతినేని( Ram Pothineni )తో పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ మూవీ స్క్రిప్ట్ ఫైనల్ చేసుకొని ఉన్నారట.దీంతో రామ్ తో సినిమాని పూర్తి చేసుకొని వస్తే నెక్స్ట్ చేద్దామని మెగాస్టార్ చెప్పేసి ఆ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టడం జరిగిందట.ఈ లోపు కళ్యాణ్ కృష్ణతో పాటు వశిష్ట మల్లిడి దర్శకత్వంలో సినిమాలు కంప్లీట్ చేయాలని మెగాస్టార్ డిసైడ్ అయ్యారట.
అయితే పూరి జగన్నాథ్ లైగర్ మూవీతో మేకింగ్ పరంగా ప్రేక్షకులని మెప్పించలేకపోయారు.ఈ కారణంగానే చిరంజీవి అతనికి ముందు ఇంకో సినిమా చేసుకొని రమ్మని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఆల్రెడీ ఇద్దరు దర్శకులతో కమిట్ కావడం వలన పూరి కథ నచ్చిన లేట్ అవుతుందని డబుల్ ఇస్మార్ట్ కంప్లీట్ చేసుకొని సలహా ఇచ్చారని మెగా సపోర్టర్స్ అంటున్న మాట.