తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలో( BJP ) మార్పులు చోటు చేసుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.కర్ణాటకలో ఓడిపోవడంతో తెలంగాణలో జరగబోయే ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.
దీంతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ని( Bandi Sanjay ) కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని.కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని ( Kishan Reddy ) రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అధినాయకత్వం నియమించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తెలంగాణలో జరగబోయే ఎన్నికలను బీజేపీ కిషన్ రెడ్డిని ముందు పెట్టి ఎదురుకోవటానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దాదాపు 40 సంవత్సరాల అనుభవంతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పనిచేశారు.ఎన్నికల సమయంలో క్యాడర్ మరియు నాయకులు మధ్య సమన్వయం కావాలంటే సుదీర్ఘ అనుభవం ఉన్న కిషన్ రెడ్డి అయితే కరెక్ట్ అని బీజేపీ హైకమాండ్ భావించినట్లు వార్తలు వస్తున్నాయి.పరిస్థితి ఇలా ఉంటే రేపు తెలంగాణకు బీజేపీ జాతీయ నేత సునీల్ బన్సల్( Sunil Bansal ) రాబోతున్నారు.
రెండు రోజులపాటు పార్టీ సంస్థాగత అంశాలపై నేతలతో చర్చించనున్నారట.తెలంగాణ బీజేపీ పార్టీలో కీలక నాయకుల మధ్య అంతర్గత విభేదాల నేపథ్యంలో బన్సల్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది.







