ఉమ్మడి పౌరస్మృతి చట్టం దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది.ఇందులో భాగంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం బిల్లును తీసుకురానుంది.
ఈ క్రమంలోనే న్యాయవ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కీలక సమావేశం నిర్వహిస్తుంది.ఈ భేటీకి న్యాయమంత్రిత్వ శాఖతో పాటు లా కమిషన్ అధికారులు హాజరయ్యారు.
కాగా దేశంలోని పౌరులు అందరికీ ఒకే చట్టం ఉండాలని బీజేపీ భావిస్తోంది.ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలందరికీ ఒకే పౌర చట్టాన్ని తీసుకురావాలని యోచనలో ఉంది.
ఈ క్రమంలోనే ఉమ్మడి పౌరస్మృతి చట్టానికి సంబంధించి బిల్లును తీసుకురానుందని సమాచారం.అయితే ఈ చట్టాన్ని విపక్ష పార్టీలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.







