ఎండాకాలంలో ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు చాలామంది ఇంట్లో ఏసీలు వినియోగిస్తూ ఉంటారు.చల్లని వాతావరణం కోసం ఏసీలు కొనుగోలు చేస్తూ ఉంటారు.
దీంతో ఎండాకాలం వస్తే ఏసీల ధరలు( AC ) కూడా పెరుగుతూ ఉంటాయి.ఇక ఇంట్లో ఏసీ ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచితే కరెంట్ బిల్లు కూడా మొత్తం మొత్తంలో వస్తుంది.
ఏసీకి కరెంట్ బిల్లు( AC current bill ) చాలా ఖర్చువుతుంది.దీంతో రోజంతా ఏసీ ఆన్ చేసి ఉంచుకుంటే కరెంట్ బిల్లు షాక్ కొడుతుంది.

అయితే మార్కెట్ లోకి కొత్త రకం ఏసీ అందుబాటులోకి వచ్చింది.ఈ ఏసీని ఎంత వాడినా కరెంట్ బిల్లు రాదట.సోలార్ ఏసీలు( Solar ACs ) ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చేశాయి.
ఇవి సూర్యరశ్శి నుంచి సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ శక్తిపై పనిచేస్తాయి.ఈ సోలార్ ఏసీల వల్ల కరెంట్ అవసరం అసలు ఉండదు.
ఈ సోలార్ ఏసీ సౌరశక్తి, సోలార్ బ్యాటరీ బ్యాంక్, విద్యుత్ ద్వారా పనిచేస్తుంది.సోలార్ ప్యానెళ్లు పగటిపూట మాత్రమే పనిచేసినప్పటికీ.
బ్యాటరీ సహాయంతో రాత్రి కూడా ఏసీ వాడుకోవచ్చు.ఇందుకోసం సోలార్ ప్యానెల్స్ను ఇంటి పైకప్పు మీద పెట్టుకోవాల్సి ఉంది.

అయితే కరెంట్ అవసరం లేని ఈ సోలార్ ఏసీ ధరలు బాగా ఎక్కువగా ఉంటాయి.సాధారణ ఏసీలతో పాటు డబుల్ రేట్లు ఉంటాయి.ఈ కామర్స్ వెబ్ సైట్లతో పాటు షాపుల్లో కూడా ఈ సోలార్ ఏసీలను కొనుగోలు చేయవచ్చు.
చాలా వెబ్ సైట్లలో ఈ సోలార్ ఏసీలు అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి.ప్రస్తుతం ఏసీలు ఎక్కువగా వాడేవారికి కరెంట్ బిల్లు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వస్తూ ఉంటుంది.కానీ సోలార్ ఏసీల వల్ల ఆ డబ్బులు ఆదా అవుతాయి.







