ఏపీ సీఎం జగన్ ను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కలవనున్నారు.ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు ఆయన సీఎం జగన్ తో భేటీకానున్నారని సమాచారం.
ఇందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అనిల్ కుమార్ యాదవ్ ఈ భేటీలో వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే గత కొన్ని రోజులుగా నెల్లూరు రాజకీయాల్లో మార్పులు వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ సీఎం జగన్ తో సమావేశం కానుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.







