బెంగళూరులోని( Bengaluru ) ఓ ప్లేస్కూల్లో ( Playschool ) దారుణం చోటుచేసుకుంది.టీచర్లు పిల్లలను లాక్ వేసి ఒక గదిలో ఉంచగా అందులో ఓ బాలికను ఒక బాలుడు శారీరకంగా హింసించాడు.
దీనికి సంబంధించి సీసీటీవీలో రికార్డైన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.తల్లిదండ్రులు ఈ వీడియో చూసి ఆందోళనకు గురవుతున్నారు.
వైరల్ వీడియోలో రెండున్నరేళ్ల బాలుడు ఎలాంటి కారణం లేకుండానే ఏడాదిన్నర బాలికపై దారుణంగా దాడి చేయడం కనిపించింది.పిల్లలను చూసుకోవాల్సిన టీచర్ కొద్దిసేపు గది నుంచి బయటకు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది.
బాలిక శరీరంపై గాయాలను గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా శారీరక దాడి జరిగినట్లు వైద్యులు తెలిపారు.

ఈ విషయమై తల్లిదండ్రులు ప్లేస్కూల్ అధికారులను నిలదీయగా, ఈ సంఘటన గురించి తమకు తెలియదని అన్నారు.సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం వారు బాలుడు దాడి చేస్తున్న దృశ్యం చూసి షాకయ్యారు.తరువాత పోలీసులు ప్లేస్కూల్ను సందర్శించారు, అయితే సంఘటన గురించి తల్లిదండ్రులు ఎలాంటి స్టేట్మెంట్ లేదా వివరాలు అందించనందున కేసు నమోదు చేయలేదు.
ఘటనకు పాల్పడిన బాలుడిని ఇకపై ప్లేస్కూల్కు రావద్దని స్కూల్ యాజమాన్యం కోరింది.బాలిక కుటుంబ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించే ఈ టీచర్ల మధ్య తమ పిల్లను వదిలేయడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని ఆమెను కూడా మాన్పించారు.