మాస్ మహారాజా రవితేజ( Raviteja ) స్పీడ్ ను ఏ హీరో కూడా తట్టుకోలేడు.ఈయన వరుసగా నాలుగైదు సినిమాలు ప్రకటిస్తూ వాటిని ఒకదాని వెంట ఒకటి పూర్తి చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకు పోతుంటాడు.
అయితే ప్రజెంట్ ఈయన ఈ మధ్యన ప్రకటించిన సినిమాలన్నీ పూర్తి అయ్యాయి.చేతిలో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉంది.
అందుకే ఈయన లైనప్ లో మళ్ళీ కొత్త కొత్త డైరెక్టర్ల పేరులు వినిపిస్తున్నాయి.

ఇక తాజాగా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న తాజా మూవీ ‘ఈగల్’.( Eagle Movie )దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ రాగా సాలిడ్ హైప్ పెరిగింది.
ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై క్రేజీ న్యూస్ వైరల్ అయ్యింది.ఈ సినిమాలో ఆడియెన్స్ కోసం సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారట.
ఆడియెన్స్ కు ఇంట్రెస్ట్ పోనివ్వకుండా హై ఎలిమెంట్స్ తో ఈ సినిమాను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని.ప్రతీ 15 నిమిషాలకు కూడా థ్రిల్ చేసే అంశంతో ఆడియెన్స్ కు అదిరిపోయే ట్రీట్ రెడీ అవుతుందట.
అంతేకాదు ఈ సినిమా ఫ్యాన్స్ కు మాత్రమే కాదు జనరల్ ఆడియెన్స్ ను సైతం మెప్పించే చిత్రంగా ఇది నిలుస్తుందని టాక్.ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్( Kavya Thapar ) హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2024 సంక్రాంతి టార్గెట్ గా రిలీజ్ కాబోతుంది.ఇదిలా ఉండగా ప్రజెంట్ మాస్ రాజా పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswararao ) సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది.







