అర్హులైన గిరిజనులకు హక్కు పత్రాలు ఇచ్చి న్యాయం చేయండి: డీ ఆర్ ఓ కి బిజెపి ఎస్టీ మోర్చ వినతి

పోడు చేస్తున్న భూములకు అధికారులు సర్వే చేపట్టి రశీదులు సైతం ఇచ్చి వెళ్లారు.కానీ త్వరలో హక్కు పత్రాలను మంజూరు చేస్తున్నట్టుగా విడుదల చేసిన జాబితాలో చాలా మంది గిరిజన రైతుల పేర్లు లేకపోవడాన్ని గమనించి అవాక్కైపోయారు.

 Give Justice To Deserving Tribals Bjp St Morcha Plea To Dro, Tribals, Bjp St M-TeluguStop.com

దీనికి కారణం తెలుసుకుందామని కారేపల్లి మండలం చిన్నమడం పల్లి గ్రామానికి చెందిన రైతులు రెవెన్యూ మరియు ఫారెస్ట్ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు.కానీ కారణాలు మాత్రం చెప్పకుండా ఎవరికి వాళ్ళు తప్పించుకుంటూ కలెక్టరేట్ లో వెళ్లి అడగండి అని నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చారు.

శుక్రవారం కలెక్టరేట్ కి వచ్చి కలెక్టర్ ను తమ గోడును వినిపిద్దామనుకుంటే అక్కడ అధికారులు అందరూ దశాబ్ది ఉత్సవాల కోసం ఖమ్మం నగరంలో ఉన్నారు.ఎట్టకేలకు తమ దరఖాస్తును బిజెపి ఎస్టీ మోర్చ జిల్లా అధ్యక్షుడు రవి రాథోడ్ మరియు ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్ ల అధ్యక్షతన డిఆర్ఓ కి ఇచ్చి తమకు హక్కు పత్రాలను అందజేయాలని కోరారు.

తగిన విచారణ చేపట్టి గిరిజన రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటానని డిఆర్ఓ హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube