బీసీసీఐ( BCCI ) కీలక నిర్ణయం తీసుకుంది.టీమిండియా జట్టుకు మొన్నటివరకు బైజూస్ లీడ్ స్పాన్సర్గా ఉండేది.
కానీ ఆ కంపెనీ లీడ్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంది.దీంతో కొత్త కంపెనీ కోసం బీసీసీఐ బిడ్డింగ్ ఆహ్వానిస్తోంది.
అయితే తాజాగా టూల్ కిట్ స్పాన్సర్ను బీసీసీఐ ఎంపిక చేసింది.టూల్ కిట్ స్పాన్సర్( Tool Kit Sponsor ) గా ఆదిదాస్ కంపెనీని( Adidas company ) సెలక్ట్ చేసింది.
ఐదేళ్ల పాటు ఆ కంపెనీతో బీసీసీఐ డీల్ కుదర్చుకుంది.ఈ క్రమంలో ఇక లీడ్ రోల్ స్పాన్సర్ గా ఎక్కువకాలం ఉండే కంపెనీతో డీల్ కుదుర్చుకోవాలని బీసీసీఐ చూస్తోంది.

తాజాగా లీడ్ స్పాన్సర్షిప్ కోసం బీసీసీఐ టెండర్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ టెండర్ల కోసం అప్లై చేసుకున్నవారికి బిడ్ నిర్వహిస్తుంది.బిడ్ లో అర్హత సాధించినవారికి స్పాన్సర్షిప్ అవకాశం ఇవ్వనుంది.అర్హతలు ఉన్న కంపెనీలు, మిగతా నిబంధనలను పాటించే కంపెనీలకు మాత్రమే అవకాశం కల్పిస్తోంది.ఐటీటీ కొనుగోలు చేస్తే బిడ్ వేయవచ్చని, బిడ్ కు అర్హత సాధిస్తారని అనుకుంటే పోరపాటే అని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.

అలాగే బిడ్ వేయడానికి కొన్ని కంపెనీలపై బీసీసీఐ నిషేధం విధించింది.స్పోర్ట్స్ వేర్ మ్యానుఫ్యాకర్ చేసే కంపెనీలతో పాటు ఆల్కహాల్ తయారుచేసే కంపెనీలు, బెట్టింగ్ కంపెనీలు, క్రిప్టో కరెన్సీ కంపెనీలు, ఫ్యాంటసీ స్పోర్ట్స్ గేమింగ్, రియల్ మనీ గేమింగ్ వేదికలు, పొగాకు ఉత్పత్తుల బ్రాండ్లు, పోర్నోగ్రఫీ వంటి అఫెన్సివ్ వంటి కంటెంట్ కు సంబంధించిన కంపెనీలు స్పాన్సర్షిప్కు అనర్హులని ప్రకటించింది.మరికొద్దిరోజుల్లో వెస్డిండీస్ టూర్ ఉండనుంది.
దీంతో వెస్డిండీస్ టూర్ కు ముందే స్పాన్సర్ ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది.ఈ ఏడాదిలో వన్డే వరల్డ్ కప్ తో పాటు ఆసియా కప్ జరగనున్నాయి.







