నేడు వరల్డ్ బ్లడ్ డొనర్స్ డే సందర్భంగా మంత్రి పువ్వాడ రక్త దానం.

పేదలకు ఉచితంగా కీలక శస్త్రచికిత్సలు.జిల్లాకో మెడికల్‌ కళాశాల ఏర్పాటు క్షేత్ర స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలనే పల్లె, బస్తీ దవాఖానల ఏర్పాటు ప్రతి జిల్లా కేంద్రంలో డయాలసిస్‌ సెంటర్‌ టీ-హబ్‌ల ఏర్పాటుతో ఉచితంగా పరీక్షలు.

 Today On The Occasion Of World Blood Donors Day Minister Puvvada Blood Donation.-TeluguStop.com

అన్ని వర్గాల్లో పెరిగిన నమ్మకం.రేడియోలజి ల్యాబ్, డయాలసిస్ సెంటర్, కీమోతెరఫీ వార్డు ప్రారంభోత్సవం.

న్యూట్రిషన్ కీట్స్ పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ఓ సినీ కవి రాసిన పాట ఇప్పుడు పూర్తిగా రివర్స్‌ అయిపోయిందని, నేను వస్త బిడ్డో సర్కారు దవాఖానకు అని పాడుకునే రోజులు వచ్చాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్( Puvvada Ajay Kumar) గారు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రేడియోలజి ల్యాబ్, డయాలసిస్ సెంటర్, కీమోతెరఫీ వార్డు లను మంత్రి పువ్వాడ ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వం సమకూర్చిన న్యూట్రిషన్ కిట్స్ లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఒకప్పుడు ఇదే హాస్పిటల్ లో కనీసం సరిపడు డాక్టర్స్ ఉండేవారు కాదు, స్వల్ప సంఖ్యలో నర్సులు, సిబ్బంది ఉండే వారని కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఏ విభాగంకు ఆ విభాగంలో ప్రత్యేక వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నారని అందుకు ప్రభుత్వంకు మంత్రి హరీష్ రావు( Harish Rao ) గారికి ధన్యవాదాలు తెలిపారు.

ఒకప్పుడు 250 పడకలలోనే 500 మంది రోగులు, ఒక్కో బెడ్ కు ఇద్దరు పేషంట్స్ ఉండేవారని ఇవన్నీ నాకు స్వయంగా తెలుసుననిఅన్నారు.కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 500 బెడ్స్ కు పెంచుకున్నమని, దీనికి తోడు ప్రత్యేక మాతా శిశు కేంద్రం, ట్రామా కేర్, క్రిటికల్ కేర్ యూనిట్, డయాలసిస్ ఇలా అనేక సేవలు ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు.

గర్భిణిల కోసం ఆరోగ్య మహిళ పథకం, కంటి వెలుగు పథకం ద్వారా కొన్ని లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు చేపట్టి లక్షల మందికి కంటి అద్దాలను పంపిణీ చేశామని పేర్కొన్నారు.ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.166 కోట్ల నిధులను ఇప్పటికే కేటాయించగా, 100 ఎంబీబీఎస్‌ సీట్లతో ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభం కానున్నాయని, రూ.9 కోట్లతో కళాశాలకు కేటాయించిన పాత కలెక్టరేట్ భవనం ఆధునీకరణ, రూ.3.5 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరు చేసుకున్నామని వివరించారు.ప్రతి పీహెచ్‌సీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ప్రధాన ఆసుపత్రికి వచ్చే వారికి 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తామని, ఈసీజీ, 2డీ ఈకో, ఎక్స్ రే, అల్ట్రా సౌండ్, మెమెగ్రఫీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామ‌న్నారు.గ‌తంలో వివిధ ప‌రీక్ష‌ల కోసం ప్ర‌భుత్వ వైద్యులు.

ప్ర‌యివేటు ల్యాబ్‌ల‌కు పంపేవారని కానీ తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత అలాంటి ప‌రిస్థితి లేద‌న్నారు.ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఏర్పాటు చేస్తున్న టీ డ‌యాగ్నోస్టిక్ హ‌బ్, రేడియోల‌జీ ల్యాబ్‌ల‌ను ప్ర‌జ‌లు వినియోగించుకోవాల‌ని మంత్రి పువ్వాడ సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు అండగా ఉందని, ప్రజలు ప్రయివేటు ఆసుపత్రికి, ప్రయివేటు స్కానింగ్ సెంటర్లకు వెళ్లొద్దన్నారు.ఏ వైద్య పరీక్ష కావాలన్నా.

ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు చేస్తారని సూచించారు.తెలంగాణ ప్రభుత్వం మన జిల్లా ఆసుపత్రిలోనే ఏర్పాట్లు చేసిన దృష్ట్యా ప్రజలు వైద్య సేవలు వినియోగించుకోవాలని ప్రజలను కోరారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీల సంఖ్య గణనీయంగా పెరిగిందని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో స్టెమీ కార్యక్రమం ద్వారా 40 వేల రూపాయల విలువ కలిగిన ఇంజక్షన్ ఇస్తూ.గుండెపోటు రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, అన్నీ జిల్లాలో స్టెమీ కార్యక్రమం ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.

న్యూట్రీషన్ కిట్స్( KCR Nutrition KIT ) పంపిణీ; గర్భిణుల్లో పోష్టికాహార లోపం, రక్తహీనత నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను అందజేసయడం శుభ పరిణామం అన్నారు.ఇప్పటికే తొలి విడతలో పలు జిల్లాల్లో గర్భిణులకు అందజేయగా రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా గర్భిణులకు కిట్ల పంపిణీలో ఖమ్మం జిల్లాలో కూడా పంపిణీ చేస్తున్నామన్నారు.

ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు 70 ఏళ్లు పలించగా నేటి వరకు కేవలం 3 కళాశాలలు వస్తే.ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 8 ఏళ్లలోనే ముఖ్యమంత్రి కేసీఅర్ గారి నేతృత్వంలో 33 మెడికల్ కళాశాలలు తెచ్చుకున్నామన్నారు.

నాటి పాలకులు వైద్య రంగాన్ని అటకెక్కించగా, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ గారు తీసుకున్న చొరవతో అనతి కాలంలోనే సర్కారు వైద్య సేవలు అన్ని వర్గాలకు చేరువయ్యాయని, ఏ రోగం వచ్చినా ఒకే సూది మందు, ఒకే మందు బిల్ల ఇచ్చిన చోటే నేడు తెలంగాణ ప్రభుత్వంలో కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వం వైద్యం అందుతున్నదన్నారు.కొవిడ్‌ వంటి విపత్కర సమయంలో ప్రైవేట్‌ దవాఖానలు మూతబడగా, రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నదన్నారు.

ఒకప్పుడు సర్కారు వైద్యం అంటే చిన్న చూపు ఉండేదని, అప్పటి ప్రభుత్వాల వైఫల్యాలు, నిరాదరణ కారణంగా ప్రైవేట్‌ వైద్య రంగం బలపడిందన్నారు.సర్కారు వైద్యం అంటేనే జనం భయపడేవారని, ఏ చిన్న రోగమైనా నయం చేయించుకునేందుకు ప్రైవేట్‌ దవాఖానలనే ఆశ్రయించే పరిస్థితుల నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్‌ గారి స్వీయ పర్యవేక్షణలో పర్యవేక్షణలో ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

కేసీఅర్ గారు ప్రభుత్వ వైద్యం బలోపేతం చేసే క్రమంలో అనేక మార్లు విశ్లేషణ చేసి క్రమంగా అద్యననం చేస్తూ భారీగా నిధులు కేటాయించి నేడు పేదలకు, సామాన్యులకు కార్పొరేట్ కు ధీటుగా పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు.ప్రజలకు ప్రైవేట్‌లో అందుబాటులో లేని అనేక సదుపాయాలను ప్రభుత్వ దవాఖానాల్లో కల్పిస్తూ వస్తోందని, ఇప్పటికే అన్ని జిల్లా ప్రధాన దవాఖానాల్లో టీ హబ్‌ సెంటర్లను ఏర్పాటు చేయడంతో నిరుపేదలు పరీక్షలు చేయించుకుంటున్నారన్నారు.

డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేయడంతో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు అత్యంత ఖరీదైన వైద్యం పూర్తి ఉచింతంగా అందుతోందని, పాలియేటివ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయడంతో బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు వైద్య సేవలు పొందుతున్నారన్నారు.దీనికి తోడు రేడియాలజీ హబ్‌ ఏర్పాటు చేయడంతో ఖరీదైన సిటీస్కార్‌, ఎక్స్‌రే సేవలు అందుబాటులోకి వచ్చాయని, మాతా శిశు ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుతో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు.

శస్త్ర చికిత్సల విభాగాలన్నింటినీ బలోపేతం చేయడం, పూర్తి స్థాయిలో వైద్యులను నియమించడంతో అన్ని రకాల శస్త్ర చికిత్సలు ఇప్పుడు ప్రభుత్వ దవాఖానాల్లోనే జరుతున్నాయని, ఒక పక్క పీహెచ్‌సీ, యూహెచ్‌సీలు ఉండగానే ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసిందన్నారు.మహిళలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని పంచాలనే లక్ష్యంతో తాజాగాచ ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా కేంద్రాల్లోని అన్ని దవాఖానాల్లో ప్రత్యేకంగా ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఆత్యవసర వైద్య సేవల్లో ప్రాణవాయువును అందిస్తున్నమన్నారు.

ఒకప్పుడు సర్కారు వైద్యమంటే భయాందోళనలో ఉన్న రోగులు ఇప్పుడు ప్రభుత్వ దవాఖానలకు వచ్చేందుకు ఏమాత్రం సంకోచించకుండా పూర్తి విశ్వాసంతో వైద్యం కోసం వస్తున్నారని పేర్కొన్నారు.చివరి దశలో ఉన్న వృద్ధుల కోసం పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, పోషకాహార లోపంతో జన్మించిన నవజాత శిశువుల కోసం ప్రత్యేకంగా డైస్‌ను అందుబాటులోకి తెచ్చిందని, కరోనా వంటి విపత్కర సమయంలో 250 ప్రత్యేక బెడ్స్‌ ఏర్పాటు చేసి ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించి సేవలు అందించామని గుర్తు చేశారు.

అలాంటి సందర్భంలోనే ప్రత్యేకంగా సెంట్రల్ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, ప్రైవేట్ లారీ ట్యాంకర్ ద్వారా ప్రతి రోజూ 5టన్నుల ఆక్సీజన్ ను తెప్పించి దవాఖానాలోని ప్రతి బెడ్‌కు ఆక్సిజన్‌ పాయింట్‌ ఇచ్చి సేవలు అందించిడం జరిగిందని, ప్రతి విభాగంలో శస్త్ర చికిత్సలు నిర్వహించి రోగులను కంటికి రెప్పలా చూసుకుంటున్నామని పేర్కొన్నారు.

కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించిన వైద్య సిబ్బందికి శిరసువంచి కృతజ్ఞతలు తెలియజేశారు.

కేటిఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్-ఏ-స్మైల్ పేరున అత్యవసర అవసరం నిమిత్తం నా సొంత ఖర్చులతో అంబులెన్స్ ను ఈ హాస్పిటల్ కు కేటాయించడమైందన్నారు.ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ఇంకా అనేక సేవలు ప్రజలకు అందిస్తామని స్పష్టం చేశారు.

నేడు వరల్డ్ బ్లడ్ డొనర్స్ డే( World Blood Donors Day ) సందర్భంగా మంత్రి పువ్వాడ రక్త దానం చేశారు.అనంతరం జిల్లాలో పని చేస్తున్న ఉత్తమ వైద్యులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు, మెమెంటోలు బహుకరించి అభినందించారు.

కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబవాల కోటేశ్వర రావు, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, సుడా చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, DMHO మాలతీ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వర రావు, ఆసుపత్రి సూరింటెండెంట్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube