వికారాబాద్ శిరీషా హత్య కేసు ఛేదన

వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో జరిగిన శిరీషా హత్య కేసును పోలీసులు ఛేదించారు.శిరీషాను ఆమె బావ అనిల్, అతని స్నేహితుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.

 Vikarabad Sirisha Murder Case Solved-TeluguStop.com

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.ఇందులో భాగంగా శిరీషాను ఆమె బావనే అంతమొందించినట్లు గుర్తించారు.

మద్యం మత్తులో హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది.ఊరి శివారులో ఉన్న మైసమ్మ గుడి వద్ద బీర్ సీసా పగలకొట్టిన అనిల్ ఫ్రెండ్ శిరీషా కళ్లలో గుచ్చాడని పోలీసులు తెలిపారు.

అనంతరం మోకాలు లోతు నీళ్లున్న కుంటలో పడేసి ఆమె చనిపోయే వరకు శిరీషాపై అనిల్ ఫ్రెండ్ నిల్చున్నాడని పేర్కొన్నారు.చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత ఆనవాళ్లు మాయం చేసిన ఇద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోయారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube