ఏపీలో గత కొన్ని రోజులుగా బీజేపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.ఈ క్రమంలో ఇటీవల బీజేపీ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
జగన్ ప్రభుత్వ పాలనలో అవినీతి కుంభకోణాలు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరగలేదని బీజేపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే.ఈ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించిన సీఎం జగన్ బీజేపీ అండగా లేకపోయినా ఫర్వాలేదన్నారు.
జగనన్న వీరెవరినీ నమ్ముకోలేదని కేవలం దేవుడి దయతో పాటు ప్రజల అండను మాత్రమే నమ్ముకున్నారని స్పష్టం చేశారు.







