ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ”పుష్ప ది రూల్”.ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
పుష్ప రాజ్ రాకకోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇక ఇటీవలే అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా గ్లింప్స్, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయగా మాసివ్ రెస్పాన్స్ అందుకుంది.ఈ అప్డేట్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా అంచనాలు డబల్ అయ్యాయి.‘‘పుష్ప ది రైజ్’‘ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పుడు అదిరిపోయే వార్త బయటకు వచ్చింది.ఈ సినిమా ఇంటర్వెల్ పై ఒక క్రేజీ న్యూస్ వైరల్ అయ్యింది.ఈ సినిమాలో చనిపోయాడు అనుకున్న పుష్పరాజ్ ఇంటర్వెల్ లో బిగ్ ట్విస్ట్ ఇస్తాడట.
అంతేకాదు రష్మిక మందన్న( Rashmika Mandanna ) పాత్రకు సంబంధించిన డెత్ మిస్టరీ కూడా ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ లోనే రివీల్ అవుతుందని తెలుస్తుంది.

ఇలా సుకుమార్ వెరీ ఇంట్రెస్టింగ్ గా పుష్ప 2 ఇంటర్వెల్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో కానీ లేదంటే వచ్చే ఏడాది కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక పుష్ప 1 ను మించిన అగ్ర కాస్టింగ్ ను సుకుమార్ యాడ్ చేసుకుంటూ పోతున్నాడు.
చూడాలి ఈ ఈసారి రిలీజ్ తర్వాత ఈసారి ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.







