యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో వైభవంగా నిర్వహించిన విషయం తెల్సిందే.దర్శకుడు ప్రశాంత్ వర్మ ఏర్పాట్లను అదరగొట్టాడు.
ప్రభాస్ ఎంట్రీ తో అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది.మొత్తానికి ప్రభాస్ ఆదిపురుష్ ( adipurush )యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆహా ఓహో అన్నట్లుగా సాగింది.
కానీ ఒక చిన్న లోపం మాత్రం కనిపించింది.అదే సుమ లేకపోవడం.
ఆదిపురుష్ ఈవెంట్ లో యాంకర్ గా ఝాన్సీ వ్యవహరించారు.ఆమెతో పాటు యాంకర్ ప్రదీప్ కూడా సందడి చేశాడు.
ఇద్దరు కూడా సుమ చేసిన స్థాయి లో చేయలేక పోయారు.చాలా సార్లు ఝాన్సి తప్పుగా మాట్లాడటం తప్పుగా కొన్ని పేర్లను చెప్పడం జరిగింది.ఇక స్టేజ్ పై వచ్చిన గెస్ట్ లతో మాట్లాడుతూ ఉత్సాహ పరిచే విధంగా సుమ వ్యవహరిస్తూ ఉంటారు.కానీ ఝాన్సీ( Jhansi ) కి అవకాశం దక్కలేదు.
మొత్తానికి సుమ లేకపోవడం వల్ల ఝాన్సీ మరియు ప్రదీప్ ( Pradeep )లు చేయాల్సి వచ్చింది.దాంతో అభిమానులు మరియు ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
సుమ ఉండి ఉంటే కార్యక్రమం యొక్క స్థాయి మరింతగా పెరిగేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సమ్మర్ హాలీడేస్ కోసం సుమ కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన విషయం తెల్సిందే.అందుకే ఆమె ఈ కార్యక్రమానికి రాలేక పోయింది అంటూ యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.ముందు ముందు సుమ ఆదిపురుష్ యొక్క ఈవెంట్స్ లో పాల్గొంటుందా అంటే చూడాలి.
కనీసం ఒక్క ఇంటర్వ్యూ అయినా సుమ తో ఆదిపురుష్ టీం చేస్తే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అలా సుమ ను ఆదిపురుష్ పబ్లిసిటీ లో భాగస్వామ్యం చేయాలి అనేది కొందరి అభిప్రాయం.