భూమి కోసం గొడ్డళ్లతో దాడులకు దిగిన అన్నదమ్ముళ్లు...!

యాదాద్రి భువనగిరి జిల్లా

: మానవత్వం మంట కలిసిమనీ తత్వం పెరిగిపోతున్న నేటి సమాజంలో బంధాలు,అనుబంధాలు అడ్రస్ లేకుండా పోతూ చివరికి రక్త సంబంధాలు కూడా రక్తసిక్తం అవుతున్నాయి.సభ్యసమాజం సిగ్గుపడే ఇలాంటి దారుణ ఘటన అడ్డగూడూరు మండలం( Addagudur Mandal ) మానాయికుంట గ్రామంలో( Manaikunta village ) బుధవారం జరిగింది.

 Brothers Attacked With Axes For Land Details, Yadadri Bhuvanagiri District,distr-TeluguStop.com

గ్రామానికి మార్క సైదులు, వీరయ్య( Marka Saidulu, Veeraiah ) అనే అన్నదమ్ముల మధ్య గత కొన్నాళ్లుగా భూతగాదాలు సాగుతున్నాయి.ఈ నేపథ్యంలో అన్నదమ్ములు రక్తసంబంధం మరచి పరస్పరం గొడ్డళ్ళతో దాడులు చేసుకొని పైశాచికంగా నరుక్కున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.బుధవారం వీరయ్య వ్యవసాయ భూమిలో అచ్చులు తోలుతుండగాసైదులు,అతని కొడుకు శేఖర్ లు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా తలెత్తిన ఘర్షణలో వీరయ్య అతని కుమారుడు ప్రభాస్ లు, సైదులు అతని కుమారుడు శేఖర్ లు పరస్పరం గొడ్డళ్లతో దాడులు చేసుకున్నారు.ముందస్తుగానే ఘర్షణకు సిద్ధమై వారు గొడ్డళ్లతో దాడి చేసుకోగా దాడుల్లో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

కాళ్లు చేతులు అక్కడికక్కడే తెగిపోగా,తలపై, వెన్నుపూసల్లో గాట్లు పడ్డాయి.ఇరుగుపొరుగు రైతులు,స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా,ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మోత్కూర్ ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం, భువనగిరి ఆసుపత్రికి, అటు నుంచి హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.

వారంతా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.అడ్డగుడురు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube