ఒరిస్సాలోని బాలేశ్వర్ లో కోరమండల్ ఎక్స్ప్రెస్( Coromandel Express ) కు జరిగిన రైలు ప్రమాదం భారతీయ రైల్వే చరిత్రలో మూడవ అతిపెద్ద ప్రమాదంగా రికార్డులకు ఎక్కింది .ఈ దశాబ్దపు అతిపెద్ద ఉత్పాదంగా రికార్డు అయింది .
ఇప్పటివరకు 280 మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతుంటే ఆ సంఖ్య అంతకంటే ఎక్కువే ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి.క్షతగాత్రుల సంఖ్య కూడా వెయ్యికి పైగానే ఉన్నట్లు సమాచారం .రైల్వే లను సురక్షిత ప్రయాణ మార్గంగా భావిస్తున్న కోట్లాదిమంది భారతీయులకు ఈ సంఘటన పెద్ద షాక్ ఇచ్చింది ,ఈ సంఘటన రైల్వేల భద్రతపై పెను ప్రశ్నలు తీసుకొచ్చింది .తెల్లవారితే కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చే రైల్వేలు ఇకపై ఎంత మాత్రం క్షేమం కాదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది .

ఈ ఘటనకు ప్రధాన కారణం సిగ్నలింగ్ వ్యవస్థ( Signaling system ) ఫెయిల్ అవ్వడమేనని ప్రాథమిక సమాచారం వస్తున్నప్పటికీ పేరుకుపోయిన అవినీతి, మానవ నిర్లక్ష్యం,, సాంకేతికంగా వెనకబడిపోవడం నాయకుల అవినీతి వంటి ఎన్నో కారణాలు పరోక్షంగా ఈ సంఘటనకు కారణంగా చెప్పవచ్చు కేవలం టికెట్లు రేట్లు పెంచుకొని స్లీపర్ క్లాస్ భోగిలను, జనరల్ బోగీలను తగ్గించుకుంటూ ప్రీమియం తత్కాల్( IRCTC Premium Tatkal ) పేరిట గత కొన్ని సంవత్సరాలుగా ఆదాయంపై విపరీతంగా దృష్టి పెడుతున్న రైల్వే డిపార్ట్మెంట్ టెక్నాలజీ( Technology ) ఇంప్రూవ్మెంట్ లో ,కానీ మౌలిక సదుపాయాల కల్పనలో గాని సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి./br>

రైల్వేలో రెండు లక్షల 25 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని అందులో మెజారిటీ భాగం సేఫ్టీ విభాగం లోనే అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి .అందువల్లే సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మూడు రైళ్లు ఈ ప్రమాదంలో ఇన్వాల్వ్ అవ్వటం టెక్నికల్గా అతిపెద్ద ఫెయిల్యూర్ గానే చూడాలి.
రైల్వేలలో ఆధునికతకు పెద్ద పీట వేసామని గణంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం పాటిస్తున్న వాస్తవ ప్రమాణాలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో ఈ ప్రమాదం తేట తెల్లం చేసింది.కేంద్ర ప్రభుత్వం( Central Govt ) ఈ ప్రమాద ఘటనకు కచ్చితంగా నైతిక బాధ్యత వహించాలి ,అన్నడిమాండ్ లు వినిపిస్తున్నాయి .ఈ ప్రమాద ఘటనను గుణపాఠంగా తీసుకుని అయినా టెక్నికల్ వర్కులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తే తప్ప ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఆపలేం.







