సినిమా ఇండస్ట్రీ లో ఒక ప్రొడ్యూసర్ గా సక్సెస్ కావడం చాలా కష్టం అలాంటిది ఈ ఇండస్ట్రీ లో అల్లు అరవింద్( Allu Aravind ) ప్రొడ్యూసర్ గా రానించడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే టాప్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు…రీసెంట్ గా జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న అరవింద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి.గీతా ఆర్ట్స్ 2లో కీలకంగా వ్యవహరించే బన్నీ వాసు( Bunny Vasu ) దీన్ని తెలుగులో 2018గా ( 2018 Movie ) విడుదల చేశారు.మలయాళంలో రూ.160 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోకి అనువాదమై ఘన విజయాన్ని సాధించింది.మంచి కలెక్షన్స్ను రాబడుతోంది.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన థాంక్స్ మీట్లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు…
నేను అమెరికాలో ఉండగా బన్నీ వాసు ఫోన్ చేసి నాకు 2018 సినిమా గురించి చెప్పి.
దీన్ని గీతా ఆర్ట్స్లో రిలీజ్ చేస్తే బావుంటుందని అన్నాడు.నేను చూడలేదు.కానీ నువ్వు మన గీతాలో చేస్తే బావుంటుందని అనుకుంటున్నావు కాబట్టి.సినిమా నువ్వు చూసి నచ్చితే బన్నీ వాసు అందించిన అనే వెయ్ అన్నాను.
ఇందులో ఓ చిన్న విషయం ఉంది.నేను కానీ, దిల్ రాజు వంటి సీనియర్స్ చేయాల్సిందేంటంటే.జూనియర్స్కు ఓ స్పేస్ క్రియేట్ చేయాలి…

నెక్ట్స్ జనరేషన్కు ఓ స్పేస్ క్రియేట్ చేస్తే అందులో వాళ్లు ఎదుగుతారు.మనమే అంతా ఆక్రమించేసి, పేరు.డబ్బు మనకే వచ్చేయాలంటే అది కరెక్ట్ కాదు.నేను కూడా అది తెలివి తేటలుగానే గ్రహించి పక్కన వాళ్లకి స్పేస్ ఇవ్వాలనుకున్నాను.నా వ్యక్తిత్వం కూడా పక్కన వాళ్లకు కూడా స్పేస్ ఇచ్చేలాగానే ఉంటుంది.చందు మొండేటి సినిమా తీసి దాదాపు సంవత్సరం అయిపోయింది.
ఏ సినిమా తీయలేదు.ఎవరిదీ ఒప్పుకోలేదు.
చాలా మంచి వచ్చి కూడా టెంప్టింగ్ ఆఫర్స్ కూడా ఇచ్చారు.నాకు తెలుసు…

కానీ ఇంతకు ముందు సినిమా రిలీజ్ కాక ముందే మాతో రెండు సినిమాలు చేయాలన్న కమిట్మెంట్ నాతో ఉంది.సినిమా రిలీజ్ కాకముందే తను గొప్ప డైరెక్టర్ అని గ్రహించి నేను బుక్ చేసుకున్నాను.చాలా మంది.
నేను పేర్లు చెప్పటం అనవసరం.నా ద్వారా పైకొచ్చిన వాళ్లలో చాలా మంది ఆ గీత దాటి వెళ్లి సినిమాలు చేసిన వాళ్లు ఉన్నారు… పరావాలేదు.
కానీ చందు మొండేటి మాటకు నిలబడి పోయారు.ఎంత మంచి ఏం చెప్పినా, నేను అరవింద్ గారి సినిమా చేసిన తర్వాతే చేస్తానని నిలబడ్డారు’’ అని అన్నారు…
.