ఒడిశాలోని బాలాసోర్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు.ఈ క్రమంలో రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు.
అనంతరం ప్రమాద ఘటనపై ప్రధాని మోదీకి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరాలు తెలియపరిచారు.సహాయక చర్యల వివరాలను మోదీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అక్కడ నుంచి ఆయన మరికాసేపటిలో కటక్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు.