మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భార్య, కుటుంబ సభ్యులను సిసోడియా కలిసేందుకు కోర్టు అనుమతిని ఇచ్చింది.
భార్య, కుటుంబ సభ్యులను తప్ప మిగతా ఎవరినీ కలవొద్దని సిసోడియాకు న్యాయస్థానం తెలిపింది.ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడవద్దని, ఫోన్, ఇంటర్నెట్ వాడకూడదని షరతులు విధించింది.
మనీశ్ సిసోడియా మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రేపు సాయంత్రం స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది.అనంతరం సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణను జూలై 4వ తేదీకి వాయిదా వేసింది.