నాంపల్లి ప్రత్యేక కోర్టుకు వివేకా హత్య కేసు నిందితులు..!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులను సీబీఐ నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరు పర్చింది.ఈ క్రమంలో విచారణ నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డితో పాటు సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కోర్టుకు హాజరు అయ్యారు.

 Viveka's Murder Case Accused In Nampally Special Court..!-TeluguStop.com

ఇదే కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ భాస్కర్ రెడ్డిలను ఈనెల 8వ తేదీన న్యాయస్థానం ఎదుట సీబీఐ అధికారులు హాజరు పరచనున్నారని తెలుస్తోంది.అనారోగ్యం కారణంగా ఇవాళ హాజరు కాలేదని సమాచారం.

మరోవైపు అప్రూవర్ దస్తగిరి విచారణకు గైర్హాజరు అయ్యారు.అటు వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ మంజూరు చేయాలని దాఖలైన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం సీబీఐకి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో హత్య కేసు విచారణను కోర్టు ఈనెల16కు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube