తెలుగుదేశం పార్టీకి( TDP Party )మంగళగిరి నియోజిక వర్గం చాలా ప్రత్యేకమైనది.ఈ నియోజిక వర్గంలో ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణ రెడ్డి( YCP mla Alla Ramakrishna reddy ) ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
గత ఎన్నికల్లో ఈ నియోజిక వర్గంనుంచి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేశ్( Nara lokesh ) పోటీ చేసి ఓటమిపాలయ్యారు.దాంతో ఓడిన చోటే గెలుపొందాలనే ధృడ నిశ్చయంతో నారా లోకేశ్ వచ్చే ఎన్నికల్లో కూడా మంగళగిరి ( Mangalagiri )నుంచి పోటీ చేయనున్నారు.
అయితే గతంతో పోల్చితే ప్రస్తుతం మంగళగిరిలో టీడీపీ గ్రాఫ్ బాగానే పెరిగినట్లు కనిపిస్తోంది.తరచూ నియోజిక వర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తీర్చడంలో లోకేశ్ తనదైన ముద్ర వేశారు దీంతో లోకేశ్ పై మంగళగిరి ప్రజలలో సానుకూల గట్టిగానే ఏర్పడింది.

మరోవైపు అధికార వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి నియోజిక వర్గ సమస్యలను పెద్దగా పట్టించుకోవడం లేదని, భూ అక్రమణకు పాల్పడుతున్నారనే విమర్శ ఉంది.దీంతో మంగళగిరి ప్రజలు ప్రత్యామ్నాయంగా లోకేశ్ వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది.నియోజిక వర్గంలో లోకేశ్ కు పెరుతున్న పాపులారిటీని గమనించిన నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు.తాజాగా మంగళగిరిలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ గూటికి చేరారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.ఒకవేళ ఇక్కడ టీడీపీ గెలిస్తే ముఖ్యంగా లోకేశ్ కు అతి పెద్ద ప్లేస్ అవుతుంది.

ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు తనయుడిగా లోకేశ్ రాజకీయాల్లోకీ ఆరంగేట్రం చేసినప్పటికీ.అనుభవలేమితో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.అంతే కాకుండా ఎమ్మెల్యేగా కూడా తొలిసారే ఓటమి చవిచూడడంతో ఆయన రాజకీయాలకు పనికి రాడనే విమర్శ బలపడింది.దీంతో ఆ ఆ ముద్ర చెరిపెసుకోవాలంటే మంగళగిరిలో గెలిచి చూపించడం అనివార్యంగా మారింది.
ఒకవేళ గెలిస్తే టీడీపీ భవిష్యత్ నాయకుడిగా లోకేశ్ ఎమర్జ్ అవకాశం ఉంది.అందుకే అన్నీ విధాలుగా మంగళగిరి గెలుపు టీడీపీకి మరియు లోకేశ్ కు చాలా ముఖ్యమనే చెప్పాలి.
ప్రస్తుతం మంగళ గిరిలో బలం పెంచుకునేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలన్నీ గట్టిగానే సక్సస్ అవుతున్నాయి.దీంతో ఈసారి గెలుపు ష్యూర్ షాట్ అంటోంది టీడీపీ.
మరి ఏం జరుగుతుందో చూడాలి.







