కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.అవినాశ్ రెడ్డికి న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

 Kadapa Mp Avinash Reddy Granted Anticipatory Bail-TeluguStop.com

అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.అదేవిధంగా సీబీఐ విచారణకు సహకరించాలని సూచించింది.రూ.5 లక్షలతో రెండు పూచీకత్తులు సమర్పించాలన్న ధర్మాసనం అవినాశ్ రెడ్డి దేశం విడిచి ఎక్కడకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube