అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యువతి మృతిచెందిన ఘటన మిస్టరీగా మారింది.లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో యువతి మృతిచెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు.అయితే యువతి శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈక్రమంలో తమ కూతురి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ కేజీహెచ్ వద్ద నిరసనకు దిగారు.కొద్ది రోజుల క్రితం రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి గత కొన్నిరోజులుగా భర్తతో దూరంగా ఉంటుందని తెలుస్తోంది.
ఈ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







