పార్లమెంట్ అనేది ప్రజల గొంతుక అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పట్టాభిషేకంగా భావిస్తున్నారని విమర్శించారు.
అయితే పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్ తో పాటు 20 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించిన సంగతి తెలిసిందే.రాష్ట్రపతిని కాదని ప్రధానమంత్రి మోదీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి.