సాధారణంగా ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లి వస్తుందంటే చాలు మగువలు పది రోజుల ముందు నుంచే హడావుడి పడుతుంటారు.అందరిలోనూ తామే అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని వేలకు వేలు ఖర్చుపెట్టి ఫేషియల్( Facials ) చేయించుకుంటూ ఉంటారు.
కానీ ఎలాంటి ఫేషియల్ అక్కర్లేదు.ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే సహజంగానే మీ చర్మం వైట్ గా, బ్రైట్ గా మరియు సూపర్ గ్లోయింగ్ గా మెరుస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీని ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చిటికెడు కుంకుమ పువ్వు( Saffron ) మరియు నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకోవాలి.

అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి.చివరిగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వును రోజ్ వాటర్ తో సహా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.స్కిన్ బ్రైట్ గా, గ్లోయింగ్ గా మరియు అట్రాక్టివ్ గా మారుతుంది.ఈ రెమెడీని పాటిస్తే ఎలాంటి ఫేషియల్ అక్కర్లేదు.సహజంగానే అందంగా ఆకర్షణీయంగా మెరుస్తారు.
కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.







