ఏపీలో భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.రాష్ట్రంలో 44 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
దీంతో ప్రజలు వేడిమి తాళలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మరోవైపు రాష్ట్రంలో రెండు రోజులపాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ క్రమంలో గుంటూరు, తూర్పు గోదావరితో పాటు ఎన్టీఆర్ జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.దాంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు.







