కరీంనగర్ జిల్లాలో కిడ్నాప్ కలకలం సృష్టించింది.హుజూరాబాద్ లో సినీ ఫక్కీలో నవ వధువు కిడ్నాప్ కు గురైంది.
హన్మకొండ జిల్లా మడికొండ గ్రామానికి చెందిన యువతి, వరంగల్ కు చెందిన యువకుడు కొండగట్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు.పెళ్లి తరువాత వెళ్తుండగా అడ్డుకున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వరుడిని చితకబాదారు.
అనంతరం వధువును ఎత్తుకెళ్లారు.సీసీ కెమెరాలో అపహరణ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
అయితే కిడ్నాప్ పై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నట్లు సమాచారం.