టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు దళిత ద్రోహి అని విమర్శించారు.
చంద్రబాబు తప్పుడు హామీలు ఇస్తున్నారని ఆరోపించారు.
గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి అంబటి మండిపడ్డారు.
రోడ్ షోలకు జనం రాకపోవడంతో డ్రామాలు చేస్తున్నారన్నారు.సత్తెనపల్లిలో దళితులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపణలు చేశారు.
ఇచ్చిన మాట తప్పే వ్యక్తి చంద్రబాబన్న మంత్రి అంబటి పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నారని తెలిపారు.