కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.ఎరువుల ధరలు పెంచకూడదని నిర్ణయించింది.ఈ మేరకు ఖరీఫ్ సీజన్ లో ఎరువులకు రూ.1.08 లక్షల కోట్ల రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది మంత్రివర్గం.అదేవిధంగా యూరియాకు రూ.70 వేల కోట్ల రాయితీ కల్పించాలని, డీఏపీకి రూ.38 వేల కోట్ల రాయితీ ఇవ్వాలని డిసైడ్ చేసింది.గత సంవత్సరం ఎరువుల రాయితీకి రూ.2.56 లక్షల కోట్లు ఖర్చు అయిందని కేంద్రం తెలిపింది.







