లైగర్ తర్వాత ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న పూరీ జగన్నాథ్( Puri Jagannadh ) ఫైనల్ గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.రామ్( Ram ) తోనే డబుల్ ఇస్మార్ట్ అంటూ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ఫిక్స్ చేసుకున్నాడు.
రామ్ కూడా పూరీతో కలిసి మరోసారి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు.అయితే డబుల్ ఇస్మార్ట్( Double Ismart ) పోస్టర్ చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు.
ఈ పోస్టర్ లో కేవలం త్రిశూలం ఒక్కటి చూపించాడు పూరీ.ఇస్మార్ట్ శంకర్ లో కూడా ఈ త్రిశూలం కనిపిస్తుంది.

కానీ డబుల్ ఇస్మార్ట్ లో పూరీ ఏదైనా డివోషనల్ టచ్ ఇస్తున్నాడా అంటూ ఆడియన్స్ ఆలోచిస్తున్నారు.ముఖ్యంగా ఈమధ్య వచ్చిన అఖండ తరహాలో శివ భక్తుడిగా రామ్ కనిపిస్తాడా అందుకే సింబాలిక్ గా త్రిశూలం చూపించాడా అని చర్చిస్తున్నారు.అఖండ కి డబుల్ ఇస్మార్ట్ కి సంబంధం లేకపోయినా రిలీజ్ చేసిన పోస్టర్ చూసి రకరకాల డిస్కషన్స్ చేస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్ గురించి మిగతా డీటైల్స్ బయటకు రావాల్సి ఉన్నాయి.
ఈ సినిమాను 2024 లో రిలీజ్ కూడా లాక్ చేశారు పూరీ.మార్చి 8న డబుల్ ఇస్మార్ట్ అదరగొట్టేందుకు వస్తుందని చెప్పేశారు.
మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.







