కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది.ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది.
రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు గానూ కాంగ్రెస్ 136 చోట్ల విజయం సాధించింది.మ్యాజిక్ ఫిగర్ 113 ఉండగా ఎక్కువ చోట్ల గెలుపొందిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది.
అటు అధికార పార్టీ బీజేపీ 64 సీట్లకే పరిమితం కాగా జేడీఎస్ 20 స్థానాల్లో నెగ్గగా ఇతరులు నాలుగు స్థానాలు గెలుపొందారు.కాగా కాంగ్రెస్ విజయంపై పార్టీ నేతలు సంబురాలు చేస్తున్నారు.







