అనంతపురం: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంపై అనంతలో సంబరాలు.కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్న పార్టీ శ్రేణులు.
సంబరాల్లో పాల్గొన్న మాజీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్.మాజీ ఏపీ పీసీసీ అధ్యక్షుడు కామెంట్స్….
కర్ణాటక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విజయం సాధించింది.కర్ణాటక ప్రజలు మత రాజకీయాల్ని తిరస్కరించారు.
దేవున్ని, మతాలను అడ్డం పెట్టుకుని బీజేపీ గెలవాలనుకుంది.మత రాజకీయాల్ని చేసి దేశాన్ని అమ్మేస్తున్న వారికి బుద్ధి చెప్పారు.ప్రజలు, ప్రజాస్వామ్య శక్తులు కలసి నియంతృత్వ పాలనకు స్వస్తి పలికారు.దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మరింత పట్టు సాధిస్తుంది.







