ధరణి పోర్టల్‎పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ధరణి పోర్టల్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ధరణి పోర్టల్ కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

 Central Minister Kishan Reddy's Key Comments On Dharani Portal-TeluguStop.com

లక్షలాది మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.దీని కారణంగా ప్రజలు నిరాశకు గురి అవుతున్నారన్నారు.

పోర్టల్ కింద దాదాపు పది లక్షల దరఖాస్తులు అధికారుల వద్ద, ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు.దీని బట్టే ధరణి పోర్టల్ సమస్య ఎంత తీవ్రతరంగా మారిందనేది అర్థం అవుతుందని వెల్లడించారు.

చివరకు పాస్ పుస్తకాలలో నమోదైన తప్పులను సరిదిద్దడానికి ఎటువంటి అవకాశం లేదని ఎద్దేవా చేశారు.ధరణిలో నిమిషాల వ్యవధిలో మార్పులు జరుగుతాయని, ఎటువంటి అవినీతి జరగదని చెబుతున్నప్పటికీ అమలులో మాత్రం శూన్యమని విమర్శించారు.

ధరణి పేరుతో రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు.విలువైన భూములను బినామీ, రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచి పెట్టారని ఆరోపించారు.

బీఆర్ఎస్ నేతలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని తెలిపారు.గులాబీ నేతల కోసమే ధరణి పోర్టల్ తీసుకువచ్చారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube