చుక్కల భూముల చిక్కులకు ఏపీ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం

ఏపీలో చుక్కల భూముల చిక్కులకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది.ఈ మేరకు చుక్కల భూములను 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించనున్నారు.

 The Ap Government Has A Permanent Solution To The Problems Of Scattered Lands-TeluguStop.com

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతులకు ఆ భూములపై పూర్తి హక్కులు కల్పించనున్నారు.ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దీని వలన రాష్ట్ర వ్యాప్తంగా 97 వేల 471 రైతు కుటుంబాలకు మేలు జరగుతుందని సీఎం జగన్ తెలిపారు.చుక్కల భూముల మార్కెట్ విలువ దాదాపు 20 వేల కోట్లు ఉందన్నారు.

ఈ క్రమంలో సుమారు 2 లక్షల 6 వేల 171 ఎకరాల చుక్కల భూములకు హక్కులు రానున్నాయని తెలిపారు.చుక్కల భూముల రైతులకు గత టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు.2016లో చంద్రబాబు ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది.పుండుమీద కారం చల్లినట్లు చుక్కల భూములను నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు.

కానీ వైసీపీ ప్రభుత్వం రైతుల కోసం చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించిందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube