వైసీపీపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ మహానాడుకు ఆయన భూమి పూజ చేశారు.
అనంతరం మాట్లాడుతూ వైసీపీ విధ్వంసాలు, వినాశనాలపై మహానాడులో తీర్మానం చేస్తామని తెలిపారు.ఎన్టీఆర్ శతజయంతి సందర్బంగా మహానాడుకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడిందని పేర్కొన్నారు.
ఈ మేరకు ఈనెల 28న ఎన్టీఆర్ శత జయంతి రోజు ముగింపు సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.సభకు పోలీసులు సహకరించాలని కోరారు.







