మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైయస్ సునీత రెడ్డి..!!

వైయస్ వివేకానంద రెడ్డి ( YS Vivekananda Reddy ) హత్య కేసు వచ్చేనెల జూన్ చివరినాటికి విచారణ ముగియనున్న సంగతి తెలిసిందే.ఈ కేసులో చోటు చేసుకుంటున్నా పరిణామాలు ఏపీ రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.

 Ys Sunitha Reddy Approached The Supreme Court Once Again Details, Ys Vivekananda-TeluguStop.com

ముఖ్యంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి( YS Avinash Reddy ) సీబీఐ విచారణ ఎదుర్కోవటం కీలక పరిణామంగా మారింది.అంతే కాదు ఈ కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావటం తెలిసిందే.

ఇక ఇదే సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ఏపీ మీడియాలో మొన్నటిదాకా వార్తలు వైరల్ అయ్యాయి.

పరిస్థితి ఇలా ఉంటే ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.ఈ కేసు విచారణ స్టార్ట్ అయిన నాటి నుంచి అనేక సందర్భాలలో సుప్రీంకోర్టును సునీత రెడ్డి( Sunitha Reddy ) ఆశ్రయించటం జరిగింది.కాగా తాజాగా మరోసారి వైయస్ సునీత రెడ్డి.

సుప్రీంకోర్టును ఆశ్రయించారు.విషయంలోకి వెళ్తే గంగిరెడ్డి బెయిల్ రద్దును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేయడం జరిగింది.

ఆ పిటిషన్ లో సాక్షులను బెదిరించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.అయితే ఈ పిటిషన్ పై వచ్చేవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube